21-02-2026 01:14:33 AM
అగ్రరాజ్య అధినేత ట్రంప్కు ఎదురుదెబ్బ
సుంకాలను కొట్టివేసిన యూఎస్ అత్యున్నత న్యాయస్థానం
టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టీకరణ
వాషింగ్టన్, ఫిబ్రవరి 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ఆర్థిక విధానాలకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు వాణిజ్య భాగస్వామ్య దేశా లపై ట్రంప్ విధించిన విస్తృత టారిఫ్ల ను (దిగుమతి సుంకాలు) అమెరికా సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది.
1977 నాటి అత్యవసర చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఏకపక్షంగా టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు 6- మెజార్టీతో సంచలన తీర్పు వెలువరించి ంది. ట్రంప్ కార్యనిర్వాహక అధికారాలకు కన్జర్వేటివ్ మెజారిటీ ఉన్న కోర్టు కళ్లెం వేయడం అరుదైన ఘటనగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
అధికారాల పరిధిపై చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు..
ఈ తీర్పుపై మెజారిటీ తరఫున అభిప్రాయాన్ని రాసిన ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబరట్స్ అధ్యక్షుడి అధికారాల పరిధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అపరిమితమైన మొత్తంలో, కాలపరిమితి లేకుండా, విస్తృత స్థాయిలో ఏకపక్షంగా టారిఫ్లు విధించే అసాధారణ అధికారాన్ని అధ్యక్షుడు కోరుతున్నారు. రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు, అటువంటి అధికారాన్ని వినియోగించుకోవాలంటే కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) నుంచి స్పష్టమైన అనుమతి ఉండాలి.
కానీ, ట్రంప్ ఆధారపడిన 1977 చట్టానికి ఆ స్థాయి అధికారం లేదు’ అని ప్రధాన న్యాయమూర్తి జాన్ జాన్ రాబరట్స్ తన తీర్పులో పేర్కొన్నారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద అధ్యక్షుడికి అసాధారణ పరిస్థితుల్లో దిగుమతు లను నియంత్రించే అధికారం మాత్రమే ఉందని, టారిఫ్లు విధించే అధికారం లేదని కోర్టు తేల్చి చెప్పింది.
‘ఆర్థిక లేదా విదేశీ వ్యవహారాల్లో మాకు ప్రత్యేక నైపుణ్యం ఉందని చెప్పడం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం మాకు కేటాయించిన పరిమిత పాత్రను మాత్రమే పోషిస్తున్నాం. ఆ పాత్రను నిర్వర్తిస్తూ, ఐఈఈపీఏ చట్టం అధ్యక్షుడికి టారిఫ్లు విధించే అధికారాన్ని ఇవ్వలేదని మేము స్పష్టం చేస్తున్నాం,‘ అని జస్టిస్ రాబరట్స్ వివరించారు.
చట్టాన్ని అడ్డం పెట్టుకుని భారీగా టారిఫ్లు..
ఫెంటానిల్, వాణిజ్య లోటు వంటి అంశాలను జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన ట్రంప్, ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై భారీగా టారిఫ్లు విధించారు. ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ దేశాలపై ప్రతీకార టారిఫ్లు అమలు చేశారు. ఇందులో భాగంగానే భారత్పై 18 శాతం టారిఫ్ విధించారు. దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఐఈఈపీఏ చట్టాన్ని టారిఫ్ల కోసం ఉపయోగించిన తొలి అధ్యక్షుడు ట్రంప్ కావడం గమనార్హం.
స్టీల్, అల్యూమినియం వంటి ప్రత్యేక టారిఫ్లకు ఈ తీర్పు వర్తించదు..
అయితే, ఉక్కు, అల్యూమినియం, రాగి వంటి ఉత్పత్తులపై విధించిన రంగాల వారీ టారిఫ్లకు ఈ తీర్పు వర్తించదు. వాటిని వేరే చట్టాల కింద విధించడంతో అవి యథావిధిగా కొనసాగుతాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఇప్పటికే చెల్లించిన బిలియన్ల డాలర్ల టారిఫ్లను తిరిగి పొందేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంది. కాస్ట్కో, టయోటా గ్రూప్, రెవ్లాన్ వంటి వందలాది కంపెనీలు ఇప్పటికే ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నాయి. కాగా, సుప్రీంకోర్టు తీర్పుతో యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.