17 April, 2026 | 9:36 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

రైస్ మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు

28-03-2025 01:39 AM

జగిత్యాల అర్బన్, మార్చి 27 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో గురువారం సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. పలు రైస్ మిల్లుల యజమానులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానంతో రిటైర్డ్ ఎస్పి ప్రభాకర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని ఓ రైస్ మిల్లుతో పాటూ జిల్లాలోని మరికొన్ని రైస్ మిల్లుల్లో ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం. ఓ లారీలో  రైస్ మిల్లుకు రేషన్ బియ్యం తరలిస్తుండగా, పక్కా సమాచారంతో అధికారులు వెంబడించి తనిఖీలు చేసినట్లు సమాచారం. కాగా సిరికొండలోని సదరు రైస్ మిల్లులో గత ఏడాది జరిగిన తనిఖీల్లో సుమారుగా రూ 80 కోట్ల ధాన్యం గల్లంతైనట్లు వెలుగు చూడడం గమనార్హం.