11-06-2025 03:29:32 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలోని(Mahabubabad District) ఈదులపూసపల్లి(Edulapusapalli)లో విత్తనాల షాపుల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి(Agriculture Officer Tirupati Reddy), రూరల్ ఎస్సై దీపిక షాపులను తనిఖీ చేసి విక్రయానికి సిద్ధంగా ఉన్న విత్తనాలను తనిఖీ చేశారు. రికార్డులు, లైసెన్స్, స్టాక్ బుక్ వివరాలను పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.