8 June, 2026 | 7:37 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

ఇల్లెందు ఎంఈఓపై ఉపాధ్యాయుడి దాడి

15-11-2025 12:35 AM

- మధ్యాహ్నం సంతకం ఉదయాన్నే చేస్తున్న ఉపాధ్యాయుడు 

- నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు ఎలా చేస్తారని ప్రశ్నించిన ఎంఈఓ 

- ప్రశ్నించిన ఎంఈఓపై ఉపాధ్యాయుడు శంకర్ కర్రతో దాడి 

- ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు

ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందు మండల విద్యాశాఖ అధికారి, సుభాష్ నగర్ హై స్కూల్ హెచ్ఎం ఉమాశంకర్ పై ఉపాధ్యాయుడు ఈ శంకర్ దాడి చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎంఈఓ ఉమాశంకర్ ఉపాధ్యాయుడు శంకర్ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్లో మధ్యాహ్నం సంతకం ఉదయాన్నే చేయడంతో గమనించిన ఎంఈఓ ఉపాధ్యాయుడిని ప్రశ్నించాడు. ఇలా ఇష్టానుసారంగా సంతకాలు చేయడం సరికాదని ఎంఈఓ పేర్కొన్నాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు బూతులు తిట్టుకుంటూ ఎంఈఓపై దాడికి దిగాడు. కర్రతో ఎంఈఓ పై దాడి చేయడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో కింద పడిపోయిన ఎంఈఓపై మరల దాడికి యత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులంతా వచ్చి దాడిని నిలుపుదల చేశారు. వెంటనే ఎంఈఓను ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. దాడికి సంబంధించి ఎంఈఓ ఉమాశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఎంఈఓ ఉమా శంకర్ జిల్లా డిఇఓకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ దాడిని పలు ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి.