8 June, 2026 | 6:13 PM

Breaking News

నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టండి   •  

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన

15-11-2025 12:36 AM

నేరేడుచర్ల నవంబర్ 14:   మండలంలోని దిర్శించర్ల రైస్ మిల్లులో తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు శుక్రవారం నిరసనకు దిగారు. గత రెండు రోజుల క్రితం కూడా రైతులు యాజమాన్యంతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని రూ.20 రూపాయలు తక్కువ చొప్పున కొనుగోలు చేయాలని అభ్యర్థించారు.

అయితే శుక్రవారం ఉదయం వచ్చిన ట్రాక్టర్ దాన్యమును వద్దు అనడంతోనే రైతు రైస్ మిల్లు ముందే ధాన్యం రాశిగా పోసి నిరసన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ లో క్వింటాకి రూ.2500 చొప్పున కొనుగోలు చేస్తే ఈ రైస్ మిల్లులో 2300, 2400 చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు  మండిపడ్డారు. ఇటువంటి మిల్లు యాజమాన్యం పై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.