calender_icon.png 9 October, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీసీల ద్వారా సాంకేతిక వృత్తి విద్య

09-10-2025 12:00:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మందమర్రి, అక్టోబర్8 :ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు అధునాతన సాంకేతిక వృత్తి విద్యను అందిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం పట్టణంలోని  అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా ఎటిసిలలో వృత్తి విద్య కోర్సులను అందించడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సాంకేతిక వృత్తి విద్య కోర్సులను సద్వినియోగం చేసుకొని అభ్యర్థులు స్వయం ఉపాధి పొందాల ని కోరారు. అలాగే మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సందర్శించి 2వ సాధారణ పం చాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుండి చేపట్టనున్న నామినేషన్ల స్వీకర ణ, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. మం డల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలను 2 విడతలలో నిర్వహించడం జరుగు తుందని, జిల్లాలో 16 జెడ్పిటిసి, 129 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ దేవానంద్, ఎంపిడిఓ కార్యాలయం  అధికారులు  పాల్గొన్నారు.