14-07-2025 05:30:02 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తొలి, మలి దశ ఉద్యమించిన మహబూబాబాద్ కు చెందిన గుంజే హనుమంతు(85) అనారోగ్యంతో మరణించారు. హనుమంతు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 లో చేపట్టిన ఉద్యమంతో పాటు 2001 నుండి చేపట్టిన మలిదశ ఉద్యమంలో మహబూబాబాద్ ప్రాంతంలో కీలక పాత్ర వహించారు. హనుమంతు మరణం పట్ల మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) సంతాపం తెలిపారు. హనుమంతు ఎన్నో ఒడిదులుకులు ఎదుర్కొన్న తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కష్టపడ్డాడని గుర్తు చేశారు. వివిధ పార్టీల నేతలు, పలు సంఘాల బాధ్యులు, హనుమంతు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.