14-07-2025 05:31:49 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సెల్ ఫోన్ ను అవసరం మేరకే వినియోగించాలని కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్(SI Muralidhar Raj) విద్యార్థులకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని జ్యోతిబాపూలే బాలికల విద్యాలయం(Jyotiba Phule Girls School)లో సోమవారం విద్యార్థులకు సైబర్ నేరాలు, బాల్యవివాహాలు, ట్రాఫిక్ రూల్స్ తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలని, ఇష్టంతో చదవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఉద్భోదించారు.