23-06-2025 08:07:04 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అధ్యక్షతన డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం(Dr. B.R. Ambedkar Telangana State Secretariat)లో జరుగుతున్న ఈ కేబినెట్ భేటీలో కొత్తగా నియమితులై మంత్రులుగా బాధ్యతులు చెపట్టిన గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(Kaleshwaram Lift Irrigation Project)పై ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ రాసిన లేఖపై సుదీర్ఘ చర్చిస్తున్నారు. కాళేశ్వరంపై పూర్తి వివరాలు ఈనెల 30 లోపు కమిషన్ కు ఇవ్వాలని, గత ప్రభుత్వంలో మంత్రివర్గం ఆమోదం ఉందా..? లేదా..? వివరాలు ఇవ్వాలని నిర్ణయించారు.