calender_icon.png 24 June, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖం చాటేసిన వరుణుడు

24-06-2025 12:00:00 AM

- పత్తి విత్తి మొగులు వైపు రైతన్న చూపు

- జిల్లాలో 67,500 ఎకరాల్లో సాగు

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 23 (విజయ క్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరు ణ దేవుడు ముఖం చాటేసాడు. రోహిణి కార్తలోనే వర్షాలు కురవడం, నైరుతి రుతుపవ నాలు ఈ ఏడాది 15 రోజుల ముందుగానే తెలంగాణకు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు ఉత్సాహంగా ప త్తిని విత్తారు. జిల్లాలో 2,0 4,632 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని వ్యవసా య శా ఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 67,500 ఎకరా ల్లో రైతు లు పత్తి విత్తనాలను నాటారు.

ముందు ము రిపించిన వరుణుడు అదను సమయంలో ముఖం చాటు వేయడంతో పత్తి పంటకు వి పత్తుగా మారింది. జిల్లాలో జూన్ నెలలో కురవాల్సిన సాధారణ వర్షపాతంతో పోలి స్తే _57 శాతం లోటు వర్షపాత నమోదయింది. నైరుతి రుతుపవనాలు ముం దుగానే వస్తాయని, ఆశించిన, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తొలుత అంచనా వేయ గా, జిల్లాలో అందుకు భిన్నంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మే నెలలో రోహిణి కార్తె లోనే ముందస్తు వర్షా లు మురిపించడంతో చాలాచోట్ల రైతులు పత్తి, మొక్కజొన్న సాగు చేపట్టారు.

పత్తి విత్తనాలు నాటక ఇప్పుడు వరుణుడు ముఖం చాటేయడంతో అధిక విస్తీర్ణంలో నాటిన పత్తి విత్తనాలు ఆశించిన స్థాయిలో మొలకెత్తలేదనీ రైతుల ఆందోళన చెందుతు న్నారు. కొన్నిచోట్ల మొలకెత్తినప్పటికీ వర్షాభావ పరిస్థితులతో, సాగునీరు అందించే పరిస్థితి లేక అంకురంలోనే మాడిపో తున్నా యి. జిల్లాలో అత్యధికంగా వర్షాధారిత పంటగా పత్తి సాగు చేయడం ఆనవాయితీగా ఉంది. దీనితో తొలకరి వర్షాలతో మురిసిపోయిన రైతులు సాగు చేసిన పత్తి పంటలు ఎండిపోతుండడంతో పెట్టుబడి కోల్పోయే పరిస్థితి నెలకొంది.

మళ్లీ వర్షాలు కురిస్తే సాగు చేయడానికి అవసరమైన విత్తనాలను సమకూ ర్చుకోవడం ఆర్థికంగా భారం గా మారిందని వాపోతున్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో 1,60,956ఎకరాల్లో వరి, 2,04,632 ఎకరాల్లో పత్తి, 85,544 ఎకరాల్లో మొక్కజొన్న, 10,488 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచింది. 

పత్తి సాగుకు అవసరమైన 4,09,264 విత్తన ప్యాకెట్లను సిద్ధం చేయగా ఇప్పటికే 57,500 ఎకరాల్లో పత్తి సాగు చేశా రు. నాటిన పత్తి వర్షాభావ పరిస్థితిలో కారణంగా మొలక దశలోనే ఎండలకు మగ్గిపో యిందని, ఫలితంగా ఎకరం పత్తి పంట సాగుకు సుమారు రూ 5వేల వరకు ఖర్చు చేశామని, వర్షాలు కురిస్తే మళ్లీ విత్తనం నాటాల్సిన పరిస్థితి ఉందని, ఈసారి వానాకాలం పంటల సాగు ఆదిలోనే ఆర్థికంగా నష్టంగా మారిందని చెబుతున్నారు.