calender_icon.png 25 May, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ భారత్ స్ఫూర్తితో ‘తెలంగాణ రైజింగ్’

25-05-2025 01:20:42 AM

  1. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందించాం

యువతకు యూత్ పాలసీ

రైతు రుణమాఫీ, రైతుభరోసాతో అన్నదాతకు దన్ను

కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం..

కేంద్రం సహకారం లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమలుచేయలేం

న్యూఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): 2047నాటికి భారత్‌ను సూపర్ పవర్‌గా, నంబర్‌వన్‌గా నిలబెట్టాలన్న ప్రధాని మోదీ సంకల్పాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘వికసిత భారత్’ ప్రణాళి కను రూపొందించడం అభినందనీయమన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రా ష్ర్ట అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందని, ఆర్థిక, సామాజిక, పరిపాలనరంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ‘తెలంగాణ రైజింగ్ -2047’ విజన్ డాక్యుమెంట్ రూపొందించామని ప్రకటించారు.

తెలంగాణ రైజింగ్ విజన్‌లోని నాలుగు కీలక అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్‌మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తామన్నారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్‌లు, ఎస్సీల ఉపవర్గీకరణకు ప్రజాప్రభు త్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నా రు.

శనివారం ఢిల్లీలో నీతిఅయోగ్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసి కార్యాచరణలో పెట్టినట్లు చెప్పా రు. అభివృద్ధిలో, సంక్షేమంలో ఆయావర్గాలకు న్యాయమైన వాటా ఇవ్వాలన్నది తమ సంకల్పమన్నారు.

అందుకే తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన చేపట్టామని తెలిపారు. బీసీలకు విద్య, స్థానిక సంస్థ ల్లో 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ.. ఈ రెండు చరిత్రాత్మక నిర్ణయాలను దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ లో అమలుచేయడం గ ర్వంగా ఉందన్నారు. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. కులగణనలో తెలంగాణ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. 

కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..

2028నాటికి రాష్ర్టంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యా న్ని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగా ణ అభివృద్ధిలో మహిళలకు కీలకపాత్ర ఉండే లా విధానాలు రూపొందించినట్లు తెలిపా రు. మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు, మహి ళా సంఘాలకు పాఠశాలల నిర్వహణ, శిల్పారామంలో 100 స్టాళ్లతో మహిళా బజార్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.

సోలార్ పవర్ జనరేషన్‌లోనూ భాగస్వామ్యం కల్పించి మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేశామన్నారు. దేశ భవిష్యత్తు యువత అని..తెలంగాణ రాష్ర్ట సాధనలో యువతదే కీలకపాత్ర అని, అందుకే యువత ఆశయాల సాధనకు అనుగుణంగా యూత్ పాలసీ అమలుచేస్తు న్నామన్నారు. 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు.

ఒకవైపు మా నవ వనరులకు డిమాండ్ పెరుగుతున్నా మరోవైపు నిరుద్యోగ సమస్య నెలకొందన్నా రు. నైపుణ్యాల కొరతే ఈ అంతరానికి కారణమని గుర్తించామని..అందుకే యంగ్ ఇం డియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరించి స్కిల్ శిక్షణ ఇస్తున్నామని సీఎం వివరించారు. 

డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా తెలంగాణ..

తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మాద కద్రవ్యాల నిర్మూలన, వాటికి అడ్డుకట్ట వేయటంలో 139 దేశాల్లో  తెలంగాణ నెంబర్-1 స్థానం సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యు వతకు రూ.5 లక్షల స్వయం ఉపాధి పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభిస్తామన్నారు. దేశానికి రైతే వెన్నెముక అని, ఆ వెన్నెముక కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణమని..వారిని అప్పుల ఊబి నుంచి బయటకు తేవడం, తిరిగి ఆ ఊబిలోకి జారిపోకుండా నిలబెట్టాలన్న లక్ష్యాల తో పనిచేస్తున్నామన్నారు.

తెలంగాణలో 25. 35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కో ట్ల రుణమాఫీ చేసి వారిని రుణవిముక్తులను చేశామన్నారు. సాగు కోసం రైతు మళ్లీ అప్పు ల పాలు కాకూడదన్న ఉద్దేశంతో ఎకరాకు రూ.12వేల రైతు భరోసా సాయం చేస్తున్నామని తెలిపారు. బియ్యానికి మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 చెల్లించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నామన్నారు. రైతుకు చేదోడుగా ఉండే వ్యవసా య కూలీకి రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తున్నామని..వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందన్నారు. 

తెలంగాణ రైజింగ్ 

2047 నాటికి ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా విషయంలో అంతర్జాతీయ నగరాల సరసన తెలంగాణ(హైదరాబాద్)ను నిలబెట్టే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఎంచుకున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ లక్ష్య సాధనలో తొలి అడుగుగా..ఏడాదిన్నర కాలంలో అమెరికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, దావోస్ (స్విట్జర్లాండ్) దేశాలలో పర్యటించి రూ.3లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని అన్నారు.

తెలంగాణ రాష్ర్టం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించి మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నా మని, తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణగా విభజించి వృద్ధి సాధిస్తామన్నారు. తెలంగాణ లో కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభాగాల్లో  మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, మెట్రో రైల్ సెకండ్ ఫేజ్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మాన్యూఫాక్చరింగ్ హబ్, అగ్రిబేస్డ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు.

సబర్మతీ రివర్ ఫ్రంట్, గంగా పునరుద్ధరణ ప్రాజెక్ట్ మాదిరిగా తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందని, మెట్రో సెకండ్ ఫేజ్, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులు ప్రస్తుతం డీపీఆర్‌ల స్టేజ్ లో ఉన్నాయని..రేడియల్ రోడ్ల నిర్మాణం, రాష్ట్రంలో ప్రతిపాదిత డ్రై పోర్ట్ నుంచి మచిలీపట్నం పోర్టుకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం తెలంగాణ అభివృద్ధిలో కీలకమవుతాయన్నారు.

గుడ్ గవర్నెన్స్‌తో అత్యున్నత ప్రమాణాలతో పౌర సేవలను అందిస్తామని..ఇందులో భాగంగా  ‘బిల్డ్ నౌ’ యాప్ ద్వారా నిర్మాణ రంగానికి వేగం పెంచినట్లు  సీఎం తెలిపారు. హైదరాబాద్‌ను డేటా సెంటర్ హబ్‌గా మార్చాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పా రు. విద్య, వైద్యంలో అంతర్జాతీయ ప్రమాణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నేషన్ ఫస్ట్- పీపుల్ ఫస్ట్ అన్న ప్రాధాన్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య అని, కేంద్రం సహాయ సహకారం మద్దతు లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమ లు చేయలేమన్నారు.

తెలంగాణ సమగ్రాభివృద్ధికి సహకరించండి, వికసిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటుందని మాట ఇచ్చారు. పహ ల్గాంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, భారత సైన్యానికి  అభినందనలు తెలిపారు.