13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

ఆసియా క్రీడల దిశగా తెలంగాణ సెయిలర్లు

06-02-2026 12:00 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): సరైన ప్రోత్సాహం, పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా ఎదగవచ్చని నిరూపిస్తున్నా రు. తెలంగాణకు చెందిన ఇద్దరు బాలికలు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన సురగాని ఈశ్వ, కొమ్మరవెల్లి లహరిలు సెయి లింగ్ క్రీడలో అద్భుతాలు సృష్టిస్తూ 2026 ఆసియా క్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే దిశగా దూసుకెళ్తున్నారు.

యాదాద్రి-భువనగిరి జిల్లా, మోటకొండూర్ మండల మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాల(బాలికలు) విద్యార్థిని సురగాని ఈశ్వ(14) చదువుతోంది. లహరి (15) సికింద్రాబాద్లోని ఉద్భవ్ స్కూల్లో చదువుతోంది. ఈ ఇద్దరు క్రీడాకారిణులు తమ మెంటర్, కోచ్ సుహైమ్ షేక్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం లహరి ’స్కిప్పర్’ గా, ఈశ్వ ’క్రూ’ గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.