calender_icon.png 6 June, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామకృష్ణాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

03-06-2025 12:00:00 AM

రామకృష్ణాపూర్, జూన్ 2: కోల్‌బెల్ట్ ఏరియా రామకృష్ణాపూర్ పట్టణంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణి అధికారులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక సింగరేణి ఠాగూర్ క్రీడ మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ ప్రొపెసర్ జయ శంకర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం జాతీ య పతాకాన్ని ఆవి ష్కరించారు. ఠాగూర్ క్రీడ మైదానం నుంచి మొదలుకొని సూపర్ బజార్ మీదగా రా మాలయం తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు జీఎం దేవేందర్ సింగరేణి అధికారులు, కార్మికులతో కలిసి కాగడాతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులైన వారిని స్మరించుకుంటు స్థూ పనికి పూలమాలలను వేసి నివాళులర్పించారు.

బీఆర్‌ఎస్ నాయకులు తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ నాయకులు అమరవీరులను స్మరించుకుం టు స్థూపనికి పూలమాలలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.