02-06-2025 10:53:02 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలంలోని పిప్పిరియల్ తాండ సమీపంలో గల నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో సోమవారం సాయంత్రం ముగ్గురు యువకులు స్థానికులు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమరిపేట గ్రామానికి చెందిన బెస్ట్ హర్షవర్ధన్(17) ఇంటర్మీడియట్ విద్యార్థి, ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ (25), ఎల్లారెడ్డికి చెందిన మధుకర్ గౌడ్(24) మన ముగ్గురు యువకులు కలిసి స్నానికి వెళ్లి గల్లంతు అయినట్లు తెలుస్తుంది.
సెలవులు కావడంతో విహారానికి స్నానాలు చేస్తుండగా ఒకరిని చూసి మరొకరు రక్షించేందుకు వెళ్లి గల్లంతయినట్లు స్థానికులు చెప్తున్నారు. వారి గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులు తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చెందుతున్నారు. ముగ్గురు యువకు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతు సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ముగ్గురు యువకుల కుటుంబాల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిజాంసాగర్ పోలీసులతో పాటు ఎల్లారెడ్డి పోలీసులు గాలింపు చర్యలలో పాల్గొన్నారు.