29-10-2025 07:17:42 PM
కోదాడ: ముకుందాపురం వాస్తవ్యులు నర్రా ఇంద్రశేఖర్ రెడ్డి అన్నపూర్ణ దంపతుల కుమార్తె డా. రూపారెడ్డి వివాహ మహోత్సవ కార్యక్రమం బుధవారం కోదాడలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి, యం యస్ విద్యాసంస్థల సీఈవో యస్ యస్ రావు, మునగాల మండల కిసాన్ సెల్ అధ్యక్షులు నర్రా శ్రీపాల్ రెడ్డి, సరికొండ నాగరాజు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.