24-09-2025 12:32:52 AM
ప్రారంభించిన కార్పొరేటర్ పుష్ప నగేశ్
రామచంద్రాపురం, సెప్టెంబర్ 23 :రామచంద్రపురం పాత రాయసముద్రం చెరువు వద్ద ఇటీవల నిర్మించిన శ్రీశ్రీశ్రీ నాగులమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో మట్టి కుంగిపోతుందని స్థానికులు తెలియజేయడంతో స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు పనులు ప్రారంభించారు.
జిహెచ్ఎంసి అధికారులు, స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ పర్యటించి సుమారు రూ.16 లక్షల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి మంగళవారం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ దివ్య, స్థానిక నాయకులు చిగురు శ్రీను, కిరణ్ గౌడ్, అప్పల భాస్కర్, నవీన్ గౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ కావలి నగేష్, మాజీ ఎఎంసి డైరెక్టర్ ఐలాపూర్ ఐలేష్, గారెళ్ల శ్రీశైలం, సిఎం మల్లేష్, రవి గౌడ్, సంతోష్, బైకన్ నవీన్ యాదవ్, కుమ్మరి రాజు, బికె శ్రీనివాస్, ఎర్ర హన్మంతు, నాగరాజు గౌడ్, కిట్టు, కుమ్మరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.