౩౦న టెన్త్ ఫలితాలు
25-04-2024 01:29 AM
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఈనెల 30వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బుధ వారం ఇంటర్ ఫలితాలను ప్రకటించిన సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈమేరకు వెల్లడించారు. 30వ తేదీన ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని, కోడింగ్ ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.






