కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలి

25-04-2024 01:31:22 AM

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : తాండూరు నియోజకవర్గం లో యాలాల మండలంలో బుధవా రం జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ సాధించేందుకు యూత్ కాంగ్రెస్ కీలకంగా పని చేసిందని గుర్తు చేశారు. వచ్చేనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా యువజన కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని సూచించారు. పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రెటరీ హైమాద్, కృష్ణంరాజు, చేవేళ్ల పార్లమెంట్ ఇన్‌ఛార్జి కావలి సంతోశ్, అసెంబ్లీ ఇన్‌ఛార్జి బస్వరాజ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.