13 May, 2026 | 11:13 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

గడువు అందుకే తగ్గించాం

19-10-2024 01:56 AM

అడ్వాన్స్ టికెట్ల కాలపరిమితి తగ్గింపుపై రైల్వే బోర్డు వివరణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: రైల్వే టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ గడువు 60 రోజులకు కుదిస్తూ తీసుకున్న నిర్ణయంపై రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. గడువు సమయం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా టికెట్లు రద్దు అవుతున్నాయని, దీం తో బెర్తులు వృథా పెరుగుతోందని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న 120 రోజుల గడువు వల్ల 21 శాతం క్యాన్సిలేషన్లు అవుతున్నాయి. 4 శాతం మంది ప్రయాణం చేయడం లేదు.

వాళ్లు టికెట్ కూడా రద్దు చేయకపోవడంతో బెర్తులు వృథాగా పోతున్నాయి అని వివరించింది. ఇది పలురకాల మోసా లు, అక్రమాలకు కారణమవుతోందని తెలిపింది. గడువు ఎక్కువగా ఉండటం వల్ల ముం దుగానే సీట్లను బ్లాక్ చేసుకుంటున్నారని, అందువల్ల నిజమైన ప్ర యాణికులకు నష్టం జరుగుతోందని పేర్కొంది.