కొద్దిపాటి వర్షాలకే కూలిన ఇల్లు
04-07-2026 07:51 PM
అశ్వారావుపేట,(విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న కొద్ది పాటి వర్షాలకు తాటాకు ఇల్లు కూలిన సంఘటన శనివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లో జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని దబ్బతోగు కాలానికి చెందిన సున్నం శ్రీదేవి మట్టి గోడలతో నిర్మించిన తాటాకు ఇంటిలో నివాసం ఉంటున్నారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి గోడలు నాని ఇల్లు మొత్తం కూలిపోయింది. ఎటువంటి ప్రాణాపాయం జరగకపోయినా, తల దాచుకోవడానికి నిలువ నీడ లేకుండా పోయింది. ఇంటిలోని తిండి గింజలు, సామానులు మట్టి దిబ్బలు కింద పడిపోయాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కన్నీరు మున్నీరు అవుతుంది.






