4 July, 2026 | 9:31 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

కొద్దిపాటి వర్షాలకే కూలిన ఇల్లు

04-07-2026 07:51 PM

అశ్వారావుపేట,(విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురుస్తున్న కొద్ది పాటి వర్షాలకు తాటాకు ఇల్లు కూలిన సంఘటన  శనివారం నాడు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లో జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని దబ్బతోగు కాలానికి చెందిన సున్నం శ్రీదేవి మట్టి గోడలతో నిర్మించిన తాటాకు ఇంటిలో నివాసం ఉంటున్నారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి గోడలు నాని ఇల్లు మొత్తం కూలిపోయింది. ఎటువంటి ప్రాణాపాయం జరగకపోయినా, తల దాచుకోవడానికి నిలువ నీడ లేకుండా పోయింది. ఇంటిలోని  తిండి గింజలు, సామానులు మట్టి దిబ్బలు కింద పడిపోయాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు  కన్నీరు మున్నీరు అవుతుంది.