09-02-2026 01:31:15 AM
అశ్వాపురం, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): అశ్వాపురం మండల పరిధిలోని చవిటిగూడెం గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 6వ తేదీన భాతిక విజయ్ను మంచం కర్రతో కొట్టి హత్య చేసిన ఘటనకు సంబంధించి, అతని సోదరుడు బాతిక అరుణ్ను ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 6వ తేదీన మృతుడు భాతిక విజయ్ మద్యం సేవించి ఇంటికి వచ్చి తన తల్లి బాతిక సత్యవతిని విపరీతంగా కొట్టడంతో కుటుంబంలో గొడవ జరిగింది.
ఈ క్రమంలో అక్కడే ఉన్న మంచం కర్రతో కొట్టడంతో భాతిక విజయ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని మణుగూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడైన బాతిక అరుణ్ను ఈరోజు అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరు పరచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.