08-09-2025 01:12:51 AM
పాట్నా, సెప్టెంబర్ 7: బీహార్లోని రాజ్గిర్ వేదికగా జరిగిన ఆసియా హాకీ కప్లో భారత్ సత్తా చాటింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను 4-1 తేడాతో చిత్తు చేసి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆసియాకప్ను కైవసం చేసుకుంది. ఇప్పటికే మూడు సార్లు ఆసియా హాకీ కప్ను గెలిచిన టీమిండియా ఈ గెలుపుతో నాలుగోసారి కూడా ఆసియా చాంపియన్గా అవతరించింది.
ఈ గెలుపుతో టీమిండియా నేరుగా హాకీ ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించింది. బెల్జియం వేదికగా 2026లో హాకీ వరల్డ్కప్ను నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. బెల్జియంలోని రెండు నగరాల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు.