5 May, 2026 | 7:00 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

ఆగిఉన్న లారీని ఢీకొన్న బస్సు..

10-12-2024 02:01 AM

*బస్సు డ్రైవర్ దుర్మరణం

మునుగోడు/చౌటుప్పల్, డిసెంబర్ 9: లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన డంతో బస్సు డ్రైవర్ మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మం డలం దండుమల్కాపురం ఆందోళ్ మైసమ్మ దేవాలయ సమీపంలో ఆదివారం జరిగింది. నల్లగొండ నుంచి హైద్రాబాద్ వెళ్తున్న లారీ దండుమల్కాపురం ఆందోళ్ మైసమ్మ దేవాలయ సమీపంలోకి వెళ్లగానే ఇంజిన్‌కు డీజిల్ అందని కారణంగా ఆకస్మికంగా ఆగి పోయింది.

దాని వెనుకాలే వెళ్త్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు ఒక్కసారిగా లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సలీంపాషా క్యాబిన్‌లో ఇరుక్కపోయి అక్క డికక్కడే మృతి చెందాడు. మృతుడిది చౌటు ప్పల్ మండలం పంతంగి గ్రామం. పోలీ స్‌లు క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయ టకు తీశారు. బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హైద రాబాద్‌కు తరలించారు. 

డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

నల్లగొండ, డిసెంబర్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం నల్లగొం డ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి చెట్ల పొద ల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో బస్సు లో 42 మంది ప్రయాణికులు ఉన్నారు.