05-05-2025 10:11:24 PM
మంథనిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ భారీ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు..
మంథని (విజయక్రాంతి): రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మంథని ప్రచార కమిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలు శివ, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యువ నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు జై బాపు-జై భీమ్-జై సంవిధాన్ కార్యక్రమం రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో మంథని పట్టణంలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్. పార్టీ చేసిన అభివృద్ధిని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. దేశంలో బిజెపి ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ, కించపరుస్తూ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తూ, ఆప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. మహాత్మా గాంధీ, డా. బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి పూలే వంటి మహానుభావులు చరిత్ర, వారి ఆశయాలు, సిద్ధాంతాలు వారు సాధించిన విజయాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధం సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.