26-01-2026 01:46:55 AM
కాంగ్రెస్ నేత కె.మురళీధర్రెడ్డి
హైదరాబాద్, జనవరి 25 (విజయ క్రాంతి): నాం పల్లి, చిరాగల్లిలేన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ సీనియ ర్ నేత కే.మురళీధర్రెడ్డి మెట్రో టీవీ క్యాలెం డర్ను నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సంద ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం దావోస్ పర్యటనలో ఇప్పటివరకు సుమారు రూ 29 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పం దాలు కుదుర్చుకుం దన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పా లని సం కల్పంతో తెలంగాణ ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేయాలని సీఎం ఆలోచనకు నా అభినందనలు అని మురళీధర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.