13 April, 2026 | 4:50 AM

సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం

13-04-2026 02:50 AM

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 12: సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి సంబంధించిన 56 మంది సంబంధించిన రూ. 24, 20,000 ల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ... సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమని అన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు అందజేసే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పక్కదారి పట్టించినట్లు  తెలిపారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరచారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పండుగల రాజు, గ్యారల శ్రీనివాస్ గౌడ్, వడ్డేపల్లి విజయేందర్ రెడ్డి, శివలింగం గౌడ్, వెంకట్ రెడ్డి వంశీధర్ రెడ్డి,  మూల కిరణ్,  మిర్యాల రాజశేఖర్, మారుతి చారి,  నాయకులు, స్థానిక పాల్గొన్నారు.