29-01-2026 12:05:26 AM
మేడ్చల్, జనవరి 28 (విజయక్రాంతి): జిల్లాలోని ఆలియాబాదు, మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నందున ఎన్నికల సాధారణ పరిశీలకులుగా కొర్ర లక్ష్మి, వ్యయ పరిశీలకులుగా సునయన చౌహాన్ నియమితు లయ్యారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి తో కలిసి సాధారణ ఎన్నికల పరిశీలకులు కొర్ర లక్ష్మి ఆలియాబాదు మున్సిపాలిటిలోని పోలింగ్ బూతులను పరిశీలించి కావలసిన మౌలిక సదుపాయాలను, రేలింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.