20 March, 2026 | 7:46 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

సైన్స్ స్క్వేర్ ను ప్రారంభం చేసిన కలెక్టర్

06-12-2024 07:12 PM

నిర్మల్ (విజయక్రాంతి): సమాజం అభివృద్దిలో సైన్స్ ప్రాదాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించి విధ్యార్థులకు సైన్స్‌పై విసృత అవగాహాన కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామాస్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ స్క్వేర్ ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా గ్రాంథాలయ ఛేర్మన్ అర్జుమంద్ అలీంతో కలిసి ప్రారంభం చేశారు. రెండు రోజులు పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలకు జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన 700 ప్రదర్శలు రావడం అభినందనీయం అన్నారు.

సైన్స్ ప్రాదాన్యత ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని సూచించారు. ప్రదర్శలో విద్యార్థులకు ప్రభుత్వ పరంగ అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రస్థాయికి పలు ప్రదర్శనలు ఎంపిక కావాలి ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కార్యాక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పదర్శలు తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాద్యాయ సంఘాల నేతలు విద్యార్థులు పాల్గొన్నారు.