రైతులను రాజులుగా చేయడమే కాంగ్రెస్ ధ్యేయం
మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
తుంగతుర్తి, ఏప్రిల్ 10: రైతులను రాజులుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ దేయమని తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి అన్నారు శుక్రవారం మద్దిరాల మండల కేంద్రంలోని ఎమ్మెస్ 1, ఎంఎస్ 2 మహిళా సంఘం ఆధ్వర్యంలో, ముకుందాపురం, జి కొత్తపల్లి, చందుపట్ల గ్రామాల్లో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అదేవిధంగా రైతులకు రుణమాఫీ రైతు భరోసా సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ ఇది రైతు ప్రభుత్వం అని రైతులు వరి ధాన్యమును 17 శాతం వచ్చే విధంగా కల్లాల వద్దనే ఆరబెట్టుకుని ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2369 మద్దతు ధర పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కాల అవిల మల్లు యాదవ్, పచ్చిపాల సుమతి వెంకన్న యాదవ్, తాళ్లపెళ్లి సురేష్ గౌడ్, బొబ్బిలి వెంకన్న, ఏవో అనీషా రుహి, ఏపీఎం శ్రీనివాస్, సీసీ సుధాకర్, గ్రామ సర్పంచులు రాంపక నాగరాజు, మీసాల సాగరిక భాస్కర్ రావు, కర్ణాకర్, వాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కొమ్ము వెంకన్న, కొమ్మ అంజయ్య మహిళా సంఘం సభ్యురాలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




