22 April, 2026 | 1:38 AM

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

22-04-2026 12:00 AM

డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్

మరిపెడ (మహబూబాబాద్) ఏప్రిల్ 21 (విజయక్రాంతి): నిలువ నీడలేని పేదలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిజం చేసిందని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. మరిపెడ మండలంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించడంతోపాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులైన నేతావత్ కవిత కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోకుండా నిజం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని చెప్పారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండయ్య, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ నరేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ నరసయ్య, బానోతు కిషోర్, ఉప సర్పంచ్ రాము నాయక్ పాల్గొన్నారు.