1 September, 2026 | 11:05 PM

Breaking News

చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •   ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు   •  

ఇందిరమ్మ గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలి

15-05-2026 | 01:52am

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బోధన్, మే 14 (విజయక్రాంతి): ఇందిరమ్మ గృహాలలో వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో ఇందిరమ్మండ్ల నిర్మాణ గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. బోధన్‌ఆర్డిఓ విజయ కుమారి, జిల్లా అధికారులతో కలిసి ఆయన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించారు.

సమస్యలను పరితంగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోని పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ తో పాటు కాంట్రాక్టర్ తో మాట్లాడి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పనులు పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.