15 April, 2026 | 10:36 AM

తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కూతుళ్లు

15-12-2025 12:36 AM

కేసముద్రం, డిసెంబర్ 14 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం పట్టణ పరిధిలోని అమ్మినాపురం లో అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి పార్థివ దేహానికి కుమార్తెలు అంత్యక్రియలు నిర్వహించారు. వంతడుపుల సమ్మయ్య అనా రోగ్యంతో మరణించగా ఆయనకు భార్య రా ధ, ముగ్గురు కుమార్తెలు ఉపేంద్ర, గీత, సరి త ఉన్నారు. కుమారుడు లేకపోవడంతో పెద్ద కుమార్తె ఉపేంద్ర తోపాటు ఇద్దరు చెల్లె లు తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు.