30-07-2025 12:18:09 AM
ఆ వార్తలన్నీ అవాస్తవం: భారత విదేశాంగ శాఖ
యెమెన్ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు
న్యూఢిల్లీ, జూలై 29: కేరళ నర్సు నిమిష ప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. యెమెన్ ప్రభుత్వం నిమిష ఉరిశిక్ష రద్దుకు అంగీకరించిందని.. ఆమెకు ఊరట లభించినట్టేనని వార్తలు వచ్చిన వేళ కేంద్ర ప్రభు త్వం స్పందించింది.
ఆమె మరణశిక్ష రద్దు కాలేదని, ఆ వార్తలన్నీ అవాస్తవమని భారత విదేశాంగ శాఖ మంగళవారం తెలిపింది. అంతకుముందు నిమిష ప్రియ మరణ శిక్ష ను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారంటూ సోమవారం అర్ధరాత్రి భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ము స్లియార్ కార్యాలయం ప్రకటన విడుదల చేసిన సం గతి తెలిసిందే.
భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండి తుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హ ఫీస్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. ఆ బృందం యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపిందని, చర్చలు ఫలించడంతో మరణశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం పేర్కొంది.
దీనిపై విదేశాంగ శాఖ స్పందిస్తూ.. నిమిష ప్రియ కేసులో కొంత మంది వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని వెల్లడించాయి. దీనిపై యెమెన్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొనడంతో నిమిష ప్రియ కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది.