calender_icon.png 3 February, 2026 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుప్పంలో చరిత్ర సృష్టించిన ఈ-మోటొరాడ్

02-02-2026 10:27:29 PM

కుప్పం: ప్రముఖ ఈవీ సంస్థ 'ఈ-మోటొరాడ్'  చిత్తూరు జిల్లా కలెక్టరేట్, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ  మరియు ఐఐటి కాన్పూర్ సంయుక్తంగా ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించాయి. ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా, 24 గంటల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేసి, 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి. కుప్పం ఒక ఆదర్శ నియోజకవర్గంగా, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు మరియు ఈ-మొబిలిటీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా నిలుస్తోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరుగుతుండటం, సరైన సర్వీస్ లేకపోవడం వంటి కారణాల వల్ల గ్రామీణ భారతదేశం ఇంకా వెనుకబడిపోతోంది.

ఈ సమస్యను పరిష్కరించడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సైకిల్ చొరవను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ-మోటొరాడ్ కుప్పం మరియు చిత్తూరు జిల్లాలోని 10,000 వేలకు పైగా కుటుంబాలకు సాధికారత కల్పించింది. లబ్ధిదారులలో చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈ నిర్వాహకులు, దుకాణ యజమానులు, పశువుల కాపరులు, పాల విక్రేతలు మరియు రోజువారీ ప్రయాణంపై ఆధారపడి జీవించే ఇతర కార్మికులు ఉన్నారు. చాలా మందికి ఇది వారి మొదటి వ్యక్తిగత వాహనం కావడం విశేషం. ఇది వారికి ఆర్థిక వెసులుబాటును మరియు ఎక్కువ స్వేచ్ఛను అందిస్తుంది.

ఈ సందర్భంగా ఈ-మోటొరాడ్ కో-ఫౌండర్ & సీఈఓ కునాల్ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ఎలా అద్భుతాలు సృష్టిస్తుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయడానికి ప్రభుత్వం , ప్రైవేట్ రంగాలు చేతులు కలిపినప్పుడు ఎంతటి ప్రభావం ఉంటుందో కుప్పం ఈ రోజు ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు.

ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, చిత్తూరు జిల్లా కలెక్టరేట్ మరియు కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి తమ కంపెనీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రికార్డు ప్రయత్నం ఏకధాటిగా 24 గంటల పాటు కొనసాగింది. తమకు ఎంతో ఇష్టమైన ఎలక్ట్రిక్ సైకిళ్లను అందుకోవడానికి లబ్ధిదారులు తెల్లవారుజామున 4 గంటల వరకు క్యూలో వేచి ఉన్నారు. ఈ రికార్డు కోసం ఉపయోగించిన అన్ని ఎలక్ట్రిక్ సైకిళ్లను, ఈవెంట్ కు 72 గంటల ముందు కేవలం 1000 మందికి పైగా ఈ-మోటొరాడ్ బృంద సభ్యులు అసెంబుల్ చేశారు.