29 July, 2026 | 9:13 PM

Breaking News

సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •  

కాంగ్రెస్ అసమర్థ పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనం

14-04-2026 12:34 AM

గజ్వేల్ మాజీ ఏఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్

గజ్వేల్, ఏప్రిల్13: కాంగ్రెస్ అసమర్థ పాలనలో ఆర్థిక వ్యవస్థ పతనం అయిందని గజ్వేల్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాచు శ్రీనివాస్ అన్నారు. గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన ఆందోలు గణేష్ తండ్రి రాజయ్య అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా, ముఖ్యమంత్రి నిధుల నుండి మంజూరు అయిన రూ.2 లక్షల (LOC) సహాయాన్ని సోమవారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అందజేశారు.

ఈ సహాయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి సహకారంతో మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ, పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రిలీఫ్ ఫండ్ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఎక్కడ అని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చే ఆర్థిక సహాయం, వృద్ధులకు పెన్షన్లు, దివ్యాంగులకు పెన్షన్ పెంపు వంటి హామీలు కూడా అమలు కాలేదని పేర్కొన్నారు.

రైతులకు రైతు భరోసా పేరుతో రూ.15,000 ఇస్తామని చెప్పి, రైతుబంధునే సక్రమంగా అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అయిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ రామ రాజ్యం వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బ్యాగారి ప్రభాకర్, ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ చాడ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అహ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజామొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.