15-06-2025 01:44:28 AM
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రక్త శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు రక్త సేకరణ కోసం రెడ్క్రాస్ వలంటీర్లు, డాక్టర్లు చేస్తున్న కృషి ప్రశంసనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా శనివారం రాజ్భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేస్తున్న దాతలను అభినందించారు. రక్త దానం ద్వారా బాధితులకు జీవితాన్ని ఇవ్వడంతోపాటు వారి కుటుంబాలకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు.
స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా ప్రజలను ప్రోత్సహిస్తున్న మోటివేటర్లు, ఆర్గనైజర్లు, సీఎస్ఆర్ పార్ట్నర్లను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ చైర్మన్ దాన కిశోర్, ప్రభు త్వ జాయింట్ సెక్రటరీ జే భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.