15-06-2025 01:42:12 AM
కరీంనగర్, జూన్ 14 (విజయక్రాంతి): నీట్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యద్భుత మార్కులతో అఖండ విజయాన్ని సాధించారు. వి.శశాంత్రెడ్డి 599 మార్కులు, బి వర్షిత్ 556, అది బాపిరోజ్ 553, జే మైథిలి 535, అఫ్నాన్ 513, బీ భువనకృతి 508, ఏ సాత్విక 507, జే అనూష 500 మార్కులు సాధించినట్లు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.
8 మంది విద్యార్థు లు 500, ఆపై మార్కులు సాధించడం విశేషమన్నారు. సుమారుగా 100 మంది విద్యా ర్థులు వివిధ ప్రతిష్టాత్మక మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించగలరని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించా రు. ఇంతటి విజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.