03-12-2025 08:46:10 PM
నిర్మల్ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టాలని ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా ముజరత్ అధికారులకు సూచించారు. బుధవారం నిర్మల్ లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఎన్నికల అధికారులు రాంగోపాల్ అజీజ్ తదితరులు ఆమెను కలిసి పూల మొక్కను అందించారు. జిల్లాలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ పరిశీలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు.