23-06-2025 12:04:00 AM
జగిత్యాల, జూన్ 22 (విజయక్రాంతి): కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీఅరుణోదయ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల వీడ్కోలు వేడుకలు ’అరుణోదయ ప్రస్థాన’ కార్యక్రమం అలరించింది. 2024 - 25 విద్యా సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు స్థానిక పిబి గార్డెన్లో శనివారం ఫేర్వెల్ డే వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్, కేరళ హైస్కూల్ కరస్పాండెంట్ ఎం.ఏ.బారీ, సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ ఆంధ్రోపన్యాసకులు బట్టు హరికృష్ణ, డైరెక్టర్ కొత్త రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పట్టుదలతో చదవుతూ, చక్కటి క్ర మశిక్షణ ఉంటేనే రాణిస్తారన్నారు.
డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలను విజయవంతంగా సాధించాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల, విద్యా బుద్ధులు చెప్పిన గు రువుల ఆశయాలకు అనుగుణంగా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు.
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పలు పోటీలలో గెలుపొందిన విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పోతని నవీన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీభవాని, పాల్గొన్నారు.