06-06-2025 12:28:13 AM
అఖిల పక్ష పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి
గద్వాల, జూన్ 5 ( విజయక్రాంతి ) : రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని గద్వాల రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కర్యాలయంలో బి ఎం సం తోష్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని 12 గ్రామాల రైతులు గత తొమ్మిది నెలలుగా శాంతియుతంగా వివిధ రూపాలలో ఆందోళనలు చేస్తున్నారని అన్నారు.
జనవరి నెలలో రైతుల నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరఫున మాజీ శాసన సభ్యులు సం పత్ కుమార్ పరిశ్రమను రద్దు చేస్తామని రైతులకు హామీ కూడా ఇచ్చారని కానీ రైతుకు వ్యవసాయ పనులలో నిమగ్న మై ఉండగా అర్ధరాత్రి కంపెనీ యాజమాన్యం జెసిబిలు కంటైనర్ల సహాయంతో కూలీలను తీసుకువచ్చి ఏకపక్షంగా నిర్మా ణానికి పనులు చేపట్టారని వారు విమర్శించారు.
20 మం దికి పైగా బౌన్సర్లను ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి నియంతృత్వంతో పరిశ్రమ పనులను వేగవంతం చేస్తున్నారని వి మర్శించారు శాంతియుతంగా నిరసన చేపట్టాడానికి వచ్చిన రైతులపై భౌతిక దాడులకు పాల్పడుతూ అసభ్య పదా జా లంతో దూషించారని విమర్శించారు. రైతులపై దాడులు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారని అఖిలపక్ష సామాజిక ప్రజాసంఘాల రాజకీయ పార్టీల నాయకులని బలవంతంగా నిర్బంధంలోకి తీసుకున్నారని విమర్శించారు.
ప్రజాభిప్రాయానికి విరుద్ధమైన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణా అనుమతులు రద్దు చేసి రైతులపై దాడులకు పాల్పడ్డ కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి రైతులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అఖిల పక్ష పార్టీల నాయకులు నాగర్ దొడ్డి వెంకటరా ములు వెంకటస్వామి కుర్వ పల్లయ్య వాల్మీకి సింగరాజు మద్దిలేటి సుభాన్ టవర్ మబ్బుల్ ఆంజనేయులు జమ్మి చెడు కార్తీక్ బీరెల్లి దానయ్య నాగన్న ఉప్పేర్ నరసింహ శ్యాం ప్రసాద్ భాస్కర్ జోషి మాణిక్యం రవి విజయ్ రాజు నగేష్ తదితరులు పాల్గొన్నారు.