calender_icon.png 8 June, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపనకు హాజరైన ఏఎంసీ చైర్మన్ భాగం నీరజదేవి ప్రభాకర్ చౌదరి దంపతులు

06-06-2025 12:28:39 AM

 కల్లూరు,జూన్5(విజయ క్రాంతి) మండల పరిధిలో ముగ్గు వెంకటాపురం గ్రామపంచాయతీకి దాదాపు 15 ఇల్లు మొదటి విడతగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవడం అయినది.ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నీరజా దేవి మాట్లాడుతూ... శంకుస్థాపన కాగానే తొలి విడతగా రూ.లక్ష చెల్లింపుఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, భూమి పూజ చేసిన కుటుంబాలకు తొలి విడతగా ప్రభుత్వం రూ.లక్షను బ్యాంక్ అకౌంట్లలో వేయనుంది.

ఆ డబ్బుతో పునాది వేసి గోడలు నిర్మించుకొని, కిటికీల ఎత్తువరకు గోడలను నిర్మించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అధికారులు పరిశీలించి, రెండో విడత నగదు పంపిణీని చెల్లిస్తారు. ప్రభుత్వం రెండో విడతగా రూ.1.25 లక్షలను లబ్ధిదారునికి ఇవ్వనుంది. ఆ డబ్బుతో ఇంటి నిర్మాణం దాదాపు పూర్తవుతుంది. అయితే స్లాబ్ నిర్మాణం కోసం మరో రూ.1.75 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. ఈ కార్యక్రమం లో బాగం ప్రభాకర్ చౌదరి, మూకర విజయ రావు,ముగ్గు వెంకటా పురం పంచాయతీ కాంగ్రెస్ నాయకులు రావి పాప రావు, చింతకాయల పుల్లారావు, చిలకా మునిబాబు, కల్లేపల్లి రమేష్, వాసం వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు .