16 April, 2026 | 10:49 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

విద్యార్థుల భవిష్యత్తు దేశ భవిష్యత్తు

20-02-2026 01:53 AM
  1. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

స్కూల్ విద్యార్థులకు షూస్ డొనేట్ చేసిన  ఎమ్మెల్యే సతీమణి 

విద్యార్థినికి తానే స్వయంగా షూ తొడిగించి లేస్ కట్టిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  

బిచ్కుంద, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తు దేశ భవిష్యత్తు అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం  కౌలాస్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన విద్యార్థుల షూ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే మాట్లాడారు.  ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే  సతీమణి తోట అర్చన ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు అవసరమైన షూస్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ తానే స్వయంగా విద్యార్థినికి షూ తొడిగించి లేస్ కట్టి అందరి హృదయాలను గెలుచుకొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని, చిన్నపిల్లల అవసరాలను గుర్తించి వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం విద్యతో పాటు పిల్లల మౌలిక అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూసి స్థానికులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.