09-02-2026 12:00:00 AM
కోదాడ (అనంతగిరి)ఫిబ్రవరి 8: అమీనాబాద్ గ్రామంలో గ్రామదేవత గంగమ్మ జాతరను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే గంగమ్మ ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, నైవేద్యాలు నిర్వహించగా భక్తులు తరగని భక్తిశ్రద్ధలతో అమ్మవారినిదర్శించుకున్నారు.
జాతర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, మహిళలు, యువత, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామస్తులను చల్లగా చూడాలని, పంటలు పండాలని, గ్రామానికి ఎలాంటి అపశ్రుతులు లేకుండా కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఏటా ఈ జాతరనునిర్వహిస్తున్నామని గ్రామ పెద్దలు తెలిపారు.
జాతర శాంతియుతంగా ముగియడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముత్తినేని కోటేశ్వరావు,చిత్తలూరి వెంకటేశ్వర్లు ,గోపతి సత్యనారాయన ,గోపతి వెంకటేశ్వర్లు, కీత లష్మినారాయణ ,గోపతి సురేష్ ,అరేపూడి వెంకటేశర్లు ,గోపాతి చిన్న వెంకటేశ్వర్లు, బత్తుల ఉప్పలు పాల్గొన్నారు.