calender_icon.png 7 June, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీలు లేని ఆహార పదార్థాలు గిరిజన మ్యూజియం సందర్శకులకు అందించాలి

05-06-2025 11:09:25 PM

ఐడిడిఏ పిఓ రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): గిరిజన మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలు ఎటువంటి కల్తీ లేకుండా మ్యూజియంకు వచ్చే సందర్శకులకు సరసమైన ధరలకు అందించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. 

గురువారం తన ఛాంబర్ లో శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ గ్రూప్ ఆర్ కొత్తగూడెం గిరిజన గ్రూప్ మహిళలు తయారుచేసిన ఇప్పపువ్వు లడ్డు, ఇతర ఆహార పదార్థాలను ఆయన చవిచూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... వివిధ ప్రాంతాల నుంచి మ్యూజియం సందర్శనకు అధిక సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారని వారికి అమ్మకాలు జరిపే ఇప్పపువ్వు లడ్డూలు, మునగాకు కారం పొడి, కరివేపాకు కారంపొడి, మామిడికాయ పచ్చళ్ళు ఏ రోజుకు ఆ రోజు తాజాగా తయారుచేసి అమ్మకాలు జరపాలని, తయారు చేసే ప్రతి వస్తువు నాణ్యతగా ఉండేలా చూడాలని మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేడియం హరికృష్ణ, ముత్యాలమ్మ లియాబిలిటీ గ్రూప్ మహిళలు సున్నం సమ్మక్క, సున్నం శిరీష, సోడే మున్ని, వేల్పుల దేవి, సున్నం స్వాతి, రమాదేవి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు