calender_icon.png 6 September, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

06-09-2025 12:17:25 AM

  1. ప్రతి జిల్లాలో డే కేర్ సెంటర్లు ఏర్పాటు 
  2. రూ.12.86 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 
  3. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

నారాయణఖేడ్/సిర్గాపూర్, సెప్టెంబర్ 5 : రాష్ట్రంలోని నిరుపేద ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మంత్రి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు.

ఈ సందర్భంగా సుమారు రూ.12.86 కో ట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మొదటగా నారాయణఖేడ్ జూకల్ చౌరస్తాలో రూ.1.15 కోట్లతో చేపట్టనున్న కన్వెన్షన్ సెంటర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణఖేడ్ మండలం జూకల్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.3.9 కోట్లతో నూతనంగా ఏ ర్పాటు చేయనున్న అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ పార్కు శంకుస్థాపన చేశారు.

దవ్వూరు నుండి మనూరు మండలం ఎన్జీ హుక్రానా వరకు ఉన్న ఆర్ అండ్ బి బీటీ రోడ్డు రూ .6 కోట్లతో చేపట్టనున్న పునరుద్ధరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశా రు. అనంతరం నారాయణఖేడ్ పట్టణంలో ని అంతర్గత రోడ్ల అనుసంధానానికి ఫార్మేషన్ రింగురోడ్డు ఏర్పాటు కోసం కోట్లతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం సిర్గాపూర్ లో రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్, నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద ప్రజలు నాణ్యమైన ఉచి త విద్యతో పాటు మెరుగైన ఉచిత వైద్య సేవలు ప్రభుత్వపరంగా అందించడానికి చి త్తశుద్ధితో పనిచేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న తొమ్మిది వేల పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో మరి న్ని పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. హైవేల వెంట ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో ఒక ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్ లు పాడు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అవసరాన్ని బట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూ చించారు. సిర్గాపూర్ లోని నల్లవాగు ప్రాజెక్టుకు నిధులు కేటాయించి టూరిస్ట్ కేంద్రం గా అభివృద్ధి చేయాలని నారాయణఖేడ్ ఎ మ్మెల్యే సంజీవరెడ్డి ఈ సందర్భంగా మంత్రి కి విజ్ఞప్తి చేశారు. సిర్గాపూర్ ప్రాథమిక ఆ రోగ్య కేంద్రం భవనానికి ఇంకా నిధులు అవసరమని ఎమ్మెల్యే కోరారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని మారుమూల నియోజకవర్గమైన నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి పరచాలని, అవసరం ఉన్నచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ఎంపీ సురేష్ షెట్కర్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, రెవెన్యూ అధికారు లు,పంచాయతీరాజ్ ,అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.