01-06-2025 07:48:40 PM
ప్రిన్సిపాల్, లెఫ్ట్నెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి..
హనుమకొండ (విజయక్రాంతి): పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి) హనుమకొండలో ప్రిన్సిపాల్ లెఫ్ట్నెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి(Principal Lieutenant Professor B. Chandramouli) మాట్లాడుతూ... దోస్త్ 2025 డిగ్రీ అడ్మిషన్స్ కు సంబంధించి మొదటి విడతలో సీటు పొందిన విద్యార్థులు జూన్ 6 లోపు ప్రతి ఒక్కరూ విధిగా సెల్ఫ్ రిపోర్ట్ చేయవలసిందిగా, రెండవ విడతలో అప్లికేషన్ పెట్టుకోవాలనుకునే విద్యార్థులకు చివరి తేదీ జూన్ 8 అని తెలుపడం జరిగింది.
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ పొందాలి అంటే తప్పనిసరిగా దోస్తు ద్వారానే అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్ధినులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ కళాశాలలో పింగిళి కళాశాల ఒకటి. అంతేకాక ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉండే కొత్త కోర్స్ లను కూడా ఈ సంవత్సరం కళాశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. కళాశాలలో, , ఎన్ సి సి, ఎన్ యస్ యస్, స్పోర్ట్స్, అన్ని రంగాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్ధినులకు నైపుణ్యలను నేర్పించడం కళాశాల యొక్కా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇంటర్ పాస్ అయినా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరడం జరిగింది.