calender_icon.png 3 June, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన కాంగ్రెస్ నాయకులు

01-06-2025 07:33:46 PM

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెంలో మంత్రి సీతక్క(Minister Seethakka) ఆదేశాల మేరకు కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కన్నాయిగూడెం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చాయి. జనగాం మల్లయ్య(బుట్టాయిగూడెం)15 వేలు, కావిరి లక్ష్మి (గంగూడెం) 20 వేలు, బొగ్గం శ్రీవాణి (గుర్రవుల) 37 వేల ఐదు వందలు, కోరం సుమలత (గుట్టల గంగారాం) 38 వేలు, కుమ్మరి నర్సింహా (కోత్తురు) 35 వేలు గల లబ్ధిదారులకు చెక్కులను కాంగ్రెస్ నాయకులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల కాంగ్రేస్ అధ్యక్షులు ఎండీ, అప్సర్ పాషా, మండల ఇంచార్జి జాడి రాంబాబు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సునార్కని రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్,కిసాన్ కాంగ్రేస్ జిల్లా సీనియర్ నాయకులు మాదాసు రాజేందర్,మండల ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు చేర్ప పగిడయ్య,జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ సునార్కని సాంభశివ, యూత్ కాంగ్రేస్ బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ సునార్కని సురేందర్, యూత్ నాయకులు కుమార్, నరేష్, దుర్గారావు, పవన్, దుర్గారావు, సీనియర్ నాయకులు గోస్కూల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.