28-10-2025 12:00:00 AM
స్టార్ హీరోయిన్ సమంత తన సొంత ప్రొడక్షన్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్పై రూపొందించిన తొలి సినిమా ‘శుభం’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో చిత్రాన్ని ప్రారంభించారామె. సమంత చాలా రోజుల క్రితం ‘మా ఇంటి బంగారం’ సినిమాను ప్రకటించిన విషయం విదితమే. ఆ చిత్రానికే ఇప్పుడు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి గౌతమి, మంజుష కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాతలు. ‘ఓ బేబి’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత సమంత, నందినిరెడ్డి కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. సీతా మీనన్, వసంత్ మరిన్గంటి కథ, స్క్రీన్ప్లే అందించగా ఉల్లాస్ హైదర్ ప్రొడక్షన్ డిజైనర్గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్గా పనిచేస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని, మరిన్ని వివరాలను తెలిజేస్తామని మేకర్స్ తెలిపారు.