23-06-2025 07:18:18 PM
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): ప్రజలందరికీ నాణ్యమైన కార్పొరేట్ ఉచిత వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) అన్నారు. సోమవారం సాయంత్రం మున్సిపాలిటీలోని నూతన ఆసుపత్రి, పాఠశాల, కళాశాలను పర్యవేక్షించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ... ప్రజలందరికీ కార్పొరేట్ ఆసుపత్రిలకు దీటుగా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు అందించడమే ప్రధాన ఏజెండా అని అన్నారు.
అనంతరం ప్రవేట్ పాఠశాల, కళాశాలలకు దీటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం ప్రజలందరికీ అందించాలనేది కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దిలీప్ కుమార్, ఎస్ఐ సురేష్, డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరీఫ్, ఆర్టిఐ మెంబర్ అంకతి శ్రీనివాస్, గడ్డం త్రిమూర్తి, కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.