23-06-2025 07:15:37 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ గా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామానికి చెందిన రాచర్ల రాములు నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ నియామక పత్రాన్ని రాములుకు అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ... రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార సాధన కోసం దాసు సురేష్ చేస్తున్న పోరాటానికి తన వంతు సహకారం అందించి, బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలపడేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి వీరేందర్ గౌడ్, సాయికిరణ్ పొడకంటి, శ్రీశైలం, గోపాల్, శోభారాణి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.