calender_icon.png 23 June, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రాజ్యాధికార సమితి స్టేట్ కన్వీనర్ గా రాములు ఎన్నిక

23-06-2025 07:15:37 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ గా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామానికి చెందిన రాచర్ల రాములు నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ నియామక పత్రాన్ని రాములుకు అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ... రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార సాధన కోసం దాసు సురేష్ చేస్తున్న పోరాటానికి తన వంతు సహకారం అందించి, బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలపడేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి వీరేందర్ గౌడ్, సాయికిరణ్ పొడకంటి, శ్రీశైలం, గోపాల్, శోభారాణి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.